- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శం

దిశ,కామేపల్లి : తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఒక రోల్ మోడల్ గా చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక విజన్ తో పని చేస్తున్నారని ఇల్లందు ఎమ్మెల్యే భానోత్ హరిప్రియ అన్నారు. గురువారం పండితాపురం శ్రీ శ్రీనివాస ఫంక్షన్ హాల్ లో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనానికి కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పండితాపురం అంతా గులాబీ మయంగా మారింది.
బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హరిప్రియ పాల్గొని మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం రాష్ట్రానికి శ్రీరామ రక్ష అన్నారు. అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శం అన్నారు. ఈ కార్యక్రమంలో కామేపల్లి మండల పార్టీ అధ్యక్షులు డి. హనుమంతరావు, ఎంపీపీ బి. సునిత, కామేపల్లి మండల రైతు బంధు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ అంతోటి అచ్చయ్య, మల్లెంపాటి శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ అజ్మీర విజయలక్ష్మి, రాజు తదితరులు పాల్గొన్నారు.