ధరణి పోర్టల్‌ను రద్దు చేయాలి: జర్పుల శ్రీనివాస్

by S Gopi |   ( Updated:2022-12-03 15:50:05.0  )
ధరణి పోర్టల్‌ను రద్దు చేయాలి: జర్పుల శ్రీనివాస్
X

దిశ, కూసుమంచి: రైతులకు ఏకకాలంలో తక్షణమే రుణమాఫీ చేయాలని తెలంగాణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, మండల అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని శ్రీనివాసు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం 9 యేండ్లుగా రైతులకు రుణామాఫీ చేస్తామని చెప్పి రైతులను మోసం చేస్తోందని విమర్శించారు. ఎన్నికలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చకుండా రైతులను ధరణి పోర్టల్ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. 2014లో ధరణి పోర్టల్ తీసుకురావడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని, ధరణి పోర్టల్ ని వెంటనే రద్దు చేసి, రీవెరిఫికేషన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, అదేవిధంగా రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేయాలని, ఐకేపీ కొనుగోళ్లు ద్వారా వేగవంతం చేయాలని, దళారులు తరుగుల పేరుతో రైతులను మోసం చేస్తున్నారని అన్నారు.

రైతుల సమస్యలు పరిష్కరించలేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. తెలుగు దేశం పార్టీ అత్యున్నత పదవులు ఎమ్మెల్యే, మంత్రి పదవులు ఇచ్చిన ఘనత తమ పార్టీకే దక్కుతుందని అన్నారు. కానీ కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు పార్టీ విడిచి వెళ్లారని, అయినప్పటికీ ప్రతి ఒక్క కార్యకర్త ఓ సైనికుడిగా పనిచేసి తెలంగాణలో టీడీపీ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో పాలేరు నుండి తెలంగాణ తెదేపా పార్టీ అభ్యర్థిగా ఎవరిని ప్రకటించినా పార్టీ నిర్ణయానికి కట్టుబడి పని చేస్తామన్నారు.

డిసెంబర్ మూడో వారంలో ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఖమ్మం జిల్లాలో కూసుమంచి మండలంలోని కేశవపురం, కూసుమంచి, నాయకన్ గూడెంలో ఎన్టీఆర్ విగ్రహాలు ఆవిష్కరిస్తారని తెలిపారు. అనంతరం ఖమ్మం జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు టీడీపీ శ్రేణులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మందపల్లి కోటేశ్వరరావు, మండల ఉపాధ్యక్షులు గోవింద యల్లయ్య, మండల తెలుగు యువత అధ్యక్షులు ఉప్పల్ ఉదయ్ కుమార్, జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి అశోక్, మండల మైనార్టీ అధ్యక్షుడు షేక్ దస్తగిరి, మండల సీనియర్ నాయకులు మాగి రమేష్ , పెండ్రా రమేష్ భాస్కర్, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed