మున్సిపల్ అవిశ్వాసం దెబ్బకు సిండికేట్ బంద్

by Sridhar Babu |
మున్సిపల్ అవిశ్వాసం దెబ్బకు సిండికేట్ బంద్
X

దిశ, ఇల్లందు : ఇల్లందు పట్టణంలో మొత్తం 8 వైన్ షాపులు ఉన్నాయి. గతంలో ఈ వైన్ షాపులన్నీ సిండికేట్ అయి ఒక చోటు నుండి ఇల్లందు మండలంలోని బెల్ట్ షాపులకు మద్యంను సరఫరా చేస్తూ కోటర్ కి 20 రూపాయల ఎక్కువ మొత్తానికి మద్యం ను సరఫరా చేస్తూ మందుబాబుల జేబులను గుల్ల చేస్తూ సిండికేట్ సిబ్బంది లక్షల్లో డబ్బులు గడించేవారు. ఆ ఎనిమిది వైన్ షాపులలో కంపెనీ బ్రాండ్ ల మద్యం దొరకక పోవడంతో బెల్ట్ షాపులను మద్యం ప్రియులు ఆశ్రయించేవారు. మూడు నెలల క్రితం ఇల్లందు పెద్ద మనిషి హైదరాబాదు ఎక్సైజ్ శాఖ కు ఇల్లందులో జరుగుతున్న సిండికేట్ వ్యవహారంపై కంప్లైంట్ చేయడంతో వారి మీద ప్రెషర్ తీసుకురావడంతో చేసేది లేక హైదరాబాద్ ఎక్సైజ్ అధికారులు ఉదయాన్నే సిండికేట్ ద్వారా బెల్టు షాపులకు మద్యం సరఫరా చేస్తున్న ఆటో ను ఆపి మద్యం ఎక్కడి నుండి తీసుకొస్తున్నావని అడిగి ఇల్లందు పట్టణంలోని 8 వైన్ షాపులలోనీ మద్యంలెక్కలను పరిశీలించారు.

ఈ లెక్కలలో తేడా రావడంతో అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గరలో ఉన్న వైన్ షాపును, బుగ్గ వాగు దగ్గర ఉన్న వైన్ షాపును సీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత 15 రోజుల వరకు ఇల్లందు పట్టణంలో సిండికేట్ ద్వారా బెల్టు షాపులకు మద్యం సరఫరా చేయడం ఆగింది. 15 రోజుల తర్వాత మళ్లీ సిండికేట్ ద్వారా మద్యం బెల్టు షాపులకు సరఫరా చేయడం ప్రారంభించారు. కానీ ఇంతలో ఇల్లందు మున్సిపాలిటీలో అవిశ్వాసం పెట్టడం, ఇందులో ఓ కౌన్సిలర్ భర్త సిండికేట్ వ్యాపారంలో ఉండడంతో మళ్లీ దాడులు జరుగుతాయని భయంతో సిండికేట్ వ్యాపారం ఆపారు. మండలంలో బెల్ట్ షాపులు పెట్టుకొని అక్రమంగా సంపాదించడానికి అలవాటు పడిన ఓనర్లు మనిషికి మూడు కోటర్ల చొప్పున ఇవ్వడంతో బెల్టు షాపుల యజమానులు, వారి బంధువులు మద్యం కోసం వైన్ షాపుల వద్ద లైన్లో నిలబడుతున్నారు. పైగా ఆ వైన్ షాపుల్లో లెక్కల్లో తేడా వస్తాయని రోజుకో షాపునకు మారుస్తూ మద్యం విక్రయిస్తున్నారు. ఇదే అదునుగా వైన్ షాపులో పనిచేసే వారి మనుషులు బెల్ట్ షాప్ యజమానులకు కౌంటర్ మీద కనపడగానే కోటర్ కి 10 రూపాయలు చొప్పున పెంచి అమ్ముతున్నారు. ఇంత తతంగం ఇల్లందులో జరుగుతున్నా చూసీచూడనట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు వ్యవహరిస్తున్నారు.



Next Story

Most Viewed