ఇసుక ర్యాంపులో లారీ డ్రైవర్ అనుమానాస్పద మృతి

by Nagaya |
ఇసుక ర్యాంపులో లారీ డ్రైవర్ అనుమానాస్పద మృతి
X

దిశ, మణుగూరు: ఇసుక లోడ్ కోసం వచ్చిన లారీ డ్రైవర్ అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు. గురువారం ఉదయం మణుగూరులోని అనంతారం ఇసుక ర్యాంపులో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు, తోటి లారీ డ్రైవర్ల కథనం ప్రకారం.. ఇసుక లోడు కోసం హైదరాబాద్ నుండి రాజు అనే లారీ డ్రైవర్ అనంతారం ఇసుక ర్యాంపునకు వచ్చాడు. సుమారు రాత్రి 2 గంటల సమయంలో ఇసుక రాంపులోకి వచ్చిన మూడు లారీలు వచ్చాయి. సింగరేణి చెక్ పోస్ట్ దాటిన అనంతరం లారీలను ఆపి ఎవరి లారీలో వాళ్లం నిద్రపోయామని.. ఉదయం చూసే సరికి రాజు మృతి చెంది ఉన్నాడని లోటి డ్రైవర్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed