ముగ్గురు ఫారెస్ట్ ఆఫీసర్ల సస్పెన్షన్

by Sridhar Babu |
ముగ్గురు ఫారెస్ట్ ఆఫీసర్ల సస్పెన్షన్
X

దిశ.కారేపల్లి : కారేపల్లి రేంజ్ పరిధిలోని ముగ్గురు ఫారెస్ట్ అధికారులను సస్పెండ్ చేసినట్లు ఇన్చార్జి ఎఫ్ఆర్ఓ బెల్లం రాధిక తెలిపారు. చీమలపాడు, పాటిమీద గుంపు సెక్షన్లలో అక్రమంగా అటవీ భూములలో బోర్లు వేసేందుకు అనుమతించారని అభియోగాలు రావడంతో విచారణ చేసిన జిల్లా ఫారెస్ట్ అధికారులు ఇద్దరు బీట్ ఆఫీసర్లు రమేష్, విజయ, చీమలపాడు సెక్షన్ ఆఫీసర్ సాంబశివరావును సస్పెండ్ చేసినట్లు తెలిపారు. అక్రమంగా రైతుల వద్ద డబ్బులు వసూలు చేసి సుమారు 30 బోర్ల వరకు వేయించారని ఆరోపణలతో విచారణ చేసిన ఫారెస్ట్ జిల్లా అధికారి సిద్ధార్థ విక్రం సింగ్ సస్పెన్షన్ చేసినట్లు ఎఫ్ఆర్ఓ రాధిక తెలిపారు. అక్రమంగా బోర్లు వేస్తున్న బోర్వెల్ యంత్రాన్ని కూడా సీజ్ చేసి ఫైన్ వేసినట్లు అధికారులు తెలిపారు.



Next Story

Most Viewed