మత్స్యశాఖలో అవినీతి అధికారుల పై సస్పెన్షన్ వేటు

by Shiva |
మత్స్యశాఖలో అవినీతి అధికారుల పై సస్పెన్షన్ వేటు
X

దిశ, వైరా: వైరా మత్స్యశాఖ కార్యాలయంలో జరిగిన అవినీతిలో భాగస్వాములైన ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. మత్స్యశాఖ అభివృద్ధి అధికారి బాజీ బుజ్జి బాబుపై సస్టెన్షన్ వేటు వేయగా, కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఫిషరీస్ అసిస్టెంట్ మార్కాపురి మురళిని సర్వీస్ నుంచి రిమూవ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ భూక్యా లచ్చిరాం ఆదేశాలు జారీ చేశారు. నిషేధ కాలంలో చేపల వేట కొనసాగించేందుకు అనుమతినిస్తూ ఫోన్ పే ద్వారా రూ.50 వేల లంచం తీసుకున్న అవినీతి సంఘటనపై ఇరువురిపై శాఖ పరమైన చర్యలు తీసుకున్నారు.

ఖమ్మం ఎఫ్ డీ వోగా విధులు నిర్వర్తిస్తున్న బుచ్చిబాబు పూర్తి అధికారాలతో వైరాలో కూడా ఎఫ్ డీ ఓ గా విధులు నిర్వహిస్తున్నారు. మురళి గత కొన్ని సంవత్సరాలుగా కాంట్రాక్ట్ పద్ధతిలో ఫిషరీ అసిస్టెంట్ గా పని చేస్తున్నారు. అయితే, 2022-23 మత్స్యశాఖ పసలి సంవత్సరంలో చేపల వేట నిషేధం ఉన్న కాలంలో చేపల వేట కొనసాగించేందుకుగాన ఈ ఇద్దరు అధికారులు వైరా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు షేక్ రహీంను రూ.లక్ష రూపాయలు లంచంగా డిమాండ్ చేశారు. దీంతో రహీం తమ సొసైటీ సభ్యుల సహకారంతో రూ.50వేలు లంచం ఇచ్చేందుకు. ఒప్పందం చేసుకున్నారు.

2022 జూలై 21న ఫిషరీస్ అసిస్టెంట్ మురళికి ఫోన్ పే ద్వారా రూ.50 వేలు రహీం చెల్లించాడు. అనంతరం ఏసీబీ అధికారులకు రహీం అధికారుల లంచం వ్యవహారంపై లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఏసిబీ అధికారులు 2022 డిసెంబర్ 23న ఖమ్మంలో బుజ్జి బాబును, మురళిని అదుపులోకి తీసుకొని సోదాలు నిర్వహించారు. ఆ సోదాల్లో అధికారులు అవినీతికి పాల్పడ్డట్లు స్పష్టమైంది. దీంతో నగదును తన ఫోన్ పే కు ట్రాన్స్ఫర్ చేయించుకున్న మురళిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో రిమాండ్ చేశారు. ఏసీబీ అధికారులు ఈ కేసులో ఏ1 గా బుజ్జి బాబును, ఏ2గా మురళిని పేర్కొంటూ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీంతో వీరిద్దరిపై శాఖపరమైన చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం వైరా ఎఫ్ డీ వోగా జిల్లా మత్స్యశాఖ అధికారి ఆంజనేయస్వామికి ఇన్ చార్జి బాధ్యతలు అప్పగిస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.



Next Story

Most Viewed