- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పేద ప్రజలకు అండగా ఉంటా : పొంగులేటి

దిశ, మణుగూరు/ అశ్వాపురం : నిరుపేద ప్రజలకు అండగా ఉండటమే తన లక్షమని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య ఆధ్వర్యంలో అశ్వాపురం మండలంలో పర్యటించారు. టీఆర్ఎస్ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం మండలంలోని పలు కుటుంబాలను పరామర్శించి, ఇటీవల చనిపోయిన కుటుంబాలను ఓదార్చి ఆర్థిక సహాయం అందించారు. పలు ప్రమాదాలలో గాయపడిన వారిని, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని పరామర్శించారు. వారికి నేనున్నానంటూ మనోధైర్యం, భరోసా కల్పించారు. అనంతరం నెల్లిపాక పీఏసీఎస్ అధ్యక్షుడు తుక్కాని మధుసూదన్ రెడ్డి తల్లి రామనరసమ్మ జ్ఞాపకార్థం కొరకు ఫ్రీజర్ బాక్స్ (శవపేటిక)ను ప్రారంభించి గ్రామపంచాయతీకి అందజేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న పేద ప్రజలందరినీ గుర్తించి వారి కుటుంబాలను ఆదుకుంటానన్నారు. నిరు పేద ప్రజలెవ్వరూ అధైర్య పడవద్దని సూచించారు. ఈ పర్యటనలో నెల్లిపాక పీఏసీఎస్ అధ్యక్షుడు తుక్కాని మధుసూదన్ రెడ్డి, అశ్వాపురం ఎంపీపీ ముత్తునేని సుజాత, మణుగూరు వైస్ ఎంపీపీ కరివేద వెంకటేశ్వర్లు, నాయకులు ముత్తునేని వాసు, ఓరుగంటి రమేష్, కీసర శ్రీనివాస్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.