ఆదరించండి అభివృద్ధి చేస్తా : తాండ్ర వినోద్​రావు

by Disha Web Desk 15 |
ఆదరించండి అభివృద్ధి చేస్తా :  తాండ్ర వినోద్​రావు
X

దిశ, ఖమ్మం టౌన్ : గత పాలకులను చూశారని, గత పదేళ్లుగా మోడీ పాలన చూశారని, దేశ అభివృద్ధి కోసం పాటుపడుతున్న మోడీ నాయకత్వంలో తాను వచ్చాను ఆదరించండి అని ఖమ్మం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్​రావు అన్నారు. బుధవారం నగరంలో విస్తృత ప్రచారం చేశారు. ఎన్టీఆర్ సర్కిల్ నుండి ఇల్లందు క్రాస్ రోడ్ వరకు టీడీపీ, బీజేపీ, ఎమ్మార్పీఎస్ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జెడ్పీ మీదుగా చర్చి కాంపౌండ్ శ్రీనివాస్ నగర్ లో వందలాది మంది జనంతో విస్తృత ప్రచారం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మోడీ నాడిని ఎవరూ కనుక్కోలేరని, మరోసారి మోడీ ప్రధానిగా అవడం ఖాయమని, ఖమ్మం నుండి తనని పార్లమెంట్ అభ్యర్థిగా పంపిస్తే జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. కాంగ్రెసు, బీఆర్ఎస్ లు ఒక్కటేనని, పేరుకు మాత్రమే ప్రచారాలు వేరువేరుగా చేస్తున్నారని, లోపాయి కారి ఒప్పందంతో బీజేపీని ఓడించడం కోసం ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. మోడీని నమ్మి ఓటు వేస్తే మీ భవిష్యత్తు మార్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. కమలం పువ్వు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, కార్పొరేటర్ దొంగల సత్యనారాయణ, దొడ్డ అరుణ, నున్న రవికుమార్, రుద్ర ప్రదీప్ పాల్గొన్నారు.

Next Story