వ్యవసాయ మందు బ‌స్తాలో ఇసుక ల‌భ్యం.. బిత్తర‌పోయిన రైతులు

by S Gopi |
వ్యవసాయ మందు బ‌స్తాలో ఇసుక ల‌భ్యం.. బిత్తర‌పోయిన రైతులు
X

దిశ‌, ఖ‌మ్మం రూర‌ల్: రూర‌ల్‌లో న‌కిలీ ఎరువుల విక్రయం క‌ల‌క‌లం రెపుతోంది. రైతులు ఆరుగాలం శ్రమించి పంట‌ను పండించాల‌న్న ల‌క్ష్యంతో త‌మ ద‌గ్గర డ‌బ్బులు ఉన్నా లేకున్నా అప్పులు చేసైనా ఎరువుల‌ను కొనుగోలు చేస్తున్నారు. కొంత‌మంది న‌కిలీ ఫెర్టిలైజ‌ర్ కంపెనీలు మాత్రం రైతులను మోసం చేస్తూ రూ. కోట్లను గ‌డిస్తున్న సంఘ‌ట‌న వంటిదే రూర‌ల్‌లో చోటు చేసుకుంది. రూర‌ల్ మండ‌లం మంగ‌ళ‌గూడెం గ్రామానికి చెందిన పిట్టల లోకేశ్ అనే రైతు ప‌క్కగ్రామమైన తీర్థాల‌లో పార్వతి ట్రెడ‌ర్స్ వద్ద కిసాన్ జ్యోతి అనే కంపెనీ బ‌యోఫెర్టిలైజ‌ర్ అనే పేరుతో ఎరువుల‌ను విక్రయిస్తుండ‌గా కొనుగోలు చేశాడు. మందును తీసుకువ‌చ్చి పొలంలో చ‌ల్లేందుకు ప్రయ‌త్నించ‌గా అనుమానం వ‌చ్చి నీటిలో క‌ల‌ప‌గా మొత్తం ఇసుకే క‌నిపించ‌డంతో రైతు అవ‌క్కాయ్యాడు. విష‌యాన్ని స్థానిక రైతుల‌కు తెలియజేయ‌డంతో వారు స్థానిక రూర‌ల్ జ‌డ్పీటీసీ యండ‌ప‌ల్లి వ‌ర‌ప్రసాద్‌కు తెలిపారు. స‌దురు కంపెనీకి చెందిన వ్యాపారి రైతును బెదిరింపుల‌కు సైతం గురిచేశాడ‌ని రైతులు వాపోతున్నారు. ఎక్కైడ‌నా చెబితే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు న‌మోదు చేయిస్తానని బెదిరించిన‌ట్లు రైతులు చెబుతున్నారు. అమాయ‌క రైతుల‌ను మోసం చేసేది కాకుండా కోట్ల రుపాయ‌ల‌ను కొల్లగోడుతున్న మాయ కంపెనీలపై వ్యవ‌సాయాధికారులు నిఘా పెట్టి వారి లైసెన్స్‌లు రద్ధు చేయాల‌ని కోరుతున్నారు. ఈ ఎరువుల‌ను కొనుగోలు చేసిన వారిలో లోకేశ్ తోపాటు యండ‌ప‌ల్లి ర‌వి, మ‌రికొంత మంది రైతులు సైతం ఉన్నారు. ఇలా ఎంత‌మందిరైతులు మోస‌పోయ్యారు మ‌రీ. చివ‌రికి కంపెనీ మేనేజ‌ర్ లైన్‌లోకి వ‌చ్చి ల‌క్ష రుపాయ‌లు ఇస్తాం విషయాన్ని ఎవ‌రికి చెప్పవ‌ద్దని చెప్పడం విడ్డూరం.

ఎరువు అని విక్రయిస్తే ఇసుక ల‌భ్యమైంది: పిట్లల లోకేశ్, రైతు, మంగ‌ళ‌గూడెం

తీర్తాల‌లో గ‌ల పార్వతి ట్రేడ‌ర్స్‌లో ఎరువులను కొనుగోలు చేసి పొలంలో చ‌ల్లుదామ‌ని అనుకున్న త‌రుణంలో ఎరువుపై అనుమానం వ‌చ్చి నీళ్లతో త‌డ‌ప‌డంతో మొత్తం క‌రిగి ఇసుకే మిగిలింది. విష‌యాన్ని స‌దురు వ్యాపారికి తెలియ‌జేయ‌డంతో న‌న్ను బెదిరించాడు. విష‌యాన్ని ఎవ‌రికైనా చెబితే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు న‌మోదు చేయిస్తామ‌ని బెదిరించాడు. చివ‌రకు విష‌యాన్ని స్థానిక జడ్పీటీసీ వ‌ర‌ప్రసాద్‌కు తెలిపాను.



Next Story

Most Viewed