- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
భవిష్యత్తు సైంటిస్టులుగా విద్యార్థులు ఎదగాలి

రాష్ట్ర ఇన్ కం టాక్స్ కమిషనర్ జీవన్ లాల్
దిశ, జూలూరుపాడు: భవిష్యత్తు సైంటిస్టులుగా విద్యార్థులు ఎదగాలి రాష్ట్ర ఇన్ కం టాక్స్ కమిషనర్ జీవన్ లాల్ అన్నారు. మండల పరిధిలోని ఏజీహెచ్ఎస్ పాఠశాలలో విదార్థులకు హైదరాబాద్ గీతం యూనివర్సిటీ ఆధ్వర్యంలో సైన్స్ పట్ల అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఇన్ కం టాక్స్ కమిషనర్ జీవన్ లాల్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు ప్రదర్శనలో ఉంచిన సైన్స్ కు సంబంధించిన వివిధ ప్రయోగాలను ఆయన పరిశీలించారు. విద్యార్థులు భవిష్యత్ సైంటిస్టులుగా ఎదగాలంటే సైన్స్ పై అవగాహన పెంపొందించుకోవడం ఎంతో అవసరమన్నారు. జీవన్ లాల్ స్వయంగా గీతం యూనివర్సిటీ వారితో మాట్లాడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించడం పట్ల పలువురు అభినందనలు తెలియజేశారు. ప్రదర్శనలో ఉంచిన ఉత్తమ ప్రదర్శనలకు క్విజ్ కాంపిటీషన్ లో గెలుపొందిన విద్యార్థులకు నగదు, బొమ్మలతో పాటు ప్రశంస పత్రాలను కూడా అందజేశారు. అనంతరంఆశ్రమ పాఠశాలకి సుమారు రూ.లక్ష విలువ గల రసాయన పరికరాలను ఆయన అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ జడ్పీటీసీ ఎంఈవో వెంకట్ సీఐ వసంత్ కుమార్, ప్రొఫెసర్లు రాంబాబు, బాలాజీ, విద్యార్థులు, తదితరులుపాల్గొన్నారు.