కరాటే లో విద్యార్థులు రాణించాలి : ప్రభుత్వ విప్ కాంతారావు

by Sridhar Babu |
కరాటే లో విద్యార్థులు రాణించాలి : ప్రభుత్వ విప్ కాంతారావు
X

దిశ,మణుగూరు : విద్యార్థులు కరాటే లో రాణించాలని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కోరారు. మణుగూరు లోని గిరిజన భవన్లో ఇంటర్ స్టేట్ కరాటే ఛాంపియన్ షిప్ -2022 కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాలలో దూసుకుపోతుందన్నారు. క్రీడలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. క్రీడాకారులు అందరూ సక్సెస్ ఫుల్ లా రాణించాలని కోరారు. గెలుపు ఓటములు ముఖ్యం కాదని, అదే క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని అన్నారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత అమ్మాయిలలో ఉన్న భయాన్ని పోగొట్టి వారిలో ధైర్య నింపేందుకు స్త్రీల రక్షణ కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేశారని తెలిపారు. క్రీడాకారులు క్రీడలలో రాణించి జాతీయ స్థాయిలో విజయం సాధించి రాష్ట్రానికి మంచి పేరు తేవాలని సూచించారు. క్రీడలకు, క్రీడాకారులకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు.



Next Story

Most Viewed