వృద్ధాశ్రమాన్ని సందర్శించిన 'న్యూఇరా షైన్' విద్యార్థులు

by Kalyani |
వృద్ధాశ్రమాన్ని సందర్శించిన న్యూఇరా షైన్ విద్యార్థులు
X

దిశ, వైరా: వైరా మండలం గొల్లపూడి గ్రామంలోని వృద్ధాశ్రమాన్ని శనివారం న్యూ ఇరా షైన్ స్కూల్ విద్యార్థులు సందర్శించి వృద్ధులకు పండ్లను, రొట్టెలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాల కరెస్పాడెంట్ డాక్టర్ పి. భూమేష్ రావు, డైరెక్టర్ కుర్రా సుమన్ మాట్లాడుతూ అనేక మంది వృద్ధులు బతుకు చివరి దశలో మెతుకు దొరకనప్పుడు, బంధాలకు భారమైనప్పుడు, అనుబంధాలు ఆవిరైన సమయంలో చివాట్లు చీదరింపులను ఎదుర్కొనలేక, కాళ్ళకు చేతికర్ర తోడై కళ్ళకు కన్నీరు వరమైన వారు వృద్ధాశ్రమంలో చేరుతున్నారని తెలిపారు. మానసికంగా కృంగిపోతున్నా వారికి ఈ సంవత్సరం చివరి రోజున కొన్ని గంటలైనా వారి కళ్లలో ఆనందాన్ని నింపేందుకు, వారి మోహంలో చిరునవ్వులు చూసేందుకు న్యూఇరా షైన్ స్కూల్ విద్యార్థులు వృద్ధులకు పండ్లు, రొట్టెలను పంపిణీ చేశారని చెప్పారు. ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని సాధ్యమైనంత చేయూతను అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సెకండరీ ప్రిన్సిపాల్ భువన ప్రసాద్, ప్రిన్సిపాల్ షాజీమాథ్యూ, షైన్ స్కూల్ ప్రిన్సిపాల్ ఆశా, ఏఓ నరసింహరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed