ఎస్ఓ పై మండిపడ్డ కస్తూర్బా ఆశ్రమ విద్యార్థులు

by Mahesh |
ఎస్ఓ పై మండిపడ్డ కస్తూర్బా ఆశ్రమ విద్యార్థులు
X

దిశ, కరకగూడెం: కరకగూడెం మండల పరిధిలోని భట్టుపల్లి గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో అధికారులకు, విద్యార్థినిలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు అక్కడకు చేరుకొని ప్రత్యేక ఎస్ ఓ అధికారితో వాగ్వాదానికి దిగారు. కస్తూర్బా గాంధీ పాఠశాలలో 6 నుండి 10 తరగతి వరకూ 231 మంది విద్యార్థినిలు చదువుతున్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందించడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యేక అధికారి శ్రీదేవి నిలదీశారు. దీనిపై ప్రత్యేక అధికారిని వివరణ కోరగా మెనూ ప్రకారమే విద్యార్థులకు ఆహారం అందిస్తున్నామని వివరించారు.

విషయం తెలుసుకున్న జీసీడీఓ అన్నమణి పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. ఇదిలా ఉండగా కస్తూర్బా గాంధీ పాఠశాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని ఆందోళన చేపట్టిన విషయం విదితమే. ఇలా ఉండగా విషయం తెలుసుకున్న జీసీడీఓ అన్నమణి పాఠశాలలో సందర్శించి ఉపాధ్యాయులు విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం చెబుతూ.. మొదటి అవకాశంగా ఈ ఒక్కసారి అవకాశం కల్పిస్తున్నామని, మరల ఈ సమస్య పునరావృతం అయితే చట్టపరమైన చర్యలు తీసుకొని అధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఆమె తెలిపారు.



Next Story

Most Viewed