సింగరేణి యాజమన్యానికి షాకింగ్ న్యూస్... సెప్టెంబర్ 9 నుంచి..

by S Gopi |
సింగరేణి యాజమన్యానికి షాకింగ్ న్యూస్... సెప్టెంబర్ 9 నుంచి..
X

దిశ, టేకులపల్లి: సెప్టెంబర్ 9వ తేదీ నుంచి జరిగే నిరవధిక సమ్మెను జయప్రదం చేయాలని జేఏసీ నాయకులు డి. ప్రసాద్, రేపాకుల శ్రీనివాస్, బానోత్ ఊక్లా, గుగులోత్ రాంచందర్ పిలుపునిచ్చారు, శనివారం సీఐటీయూ కార్యాలయంలో గుగులోత్ రాంచందర్ అధ్యక్షతన జరిగిన జేఏసీ సమావేశంలో వారు మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. అనేక దఫాలుగా చర్చలు జరిపినా యాజమాన్యం వేతనాలు పెంచడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టు కార్మికుల శ్రమతో కోట్ల రూపాయల లాభాలను పొందుతూ లాభాల్లో వాటా ఇవ్వటం లేదని అన్నారు. కాంట్రాక్టు కార్మికులందరూ సమ్మెకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఈసం నరసింహారావు, ఐత శ్రీరాములు, రత్నాచారి తదితరులు పాల్గొన్నారు.





Next Story

Most Viewed