- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలను చేస్తే కఠిన చర్యలు తప్పవు : ఎస్సై నరేష్ ముదిగొండ

దిశ, ముదిగొండ : సోషల్ మీడియా వేదికగా ఏ పార్టీ వారైనా తప్పుడు పోస్టులు పెడుతూ అసత్య ప్రచారాలు, వ్యక్తిగత దూషణలు చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, కేసులు నమోదు చేస్తామని ముదిగొండ ఎస్సై నరేశ్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో పోస్టులను, ఫోటోలు, వీడియోలను, వాట్సాప్ స్టేటస్ ద్వారా ఇతరులను కించపరిచిన, ఇతరుల వ్యాఖ్యలను షేర్ చేసే ముందు పరిశీలన చేయాలని అన్నారు.
అది నిజమో కాదో నిర్ధారణ చేసుకోవాలని, వివాదాస్పదమైన పోస్టులకు దూరంగా ఉండాలని గ్రూప్ అడ్మిన్ కుడా పోస్ట్స్ పరిశీలన చేయాలని సూచించారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు కాబట్టి అందరు కూడా గ్రామలలో స్నేహపూరిత వాతావరణం కలిగి ఉండాలన్నారు. సోషల్ మీడియాని పోలీస్ శాఖ ప్రతిరోజు పరిశీలిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు పోస్ట్ చేసే ముందు ఆలోచించి పోస్ట్ చేయాలని, లేనియెడల వారిపైన, గ్రూప్ అడ్మిన్ ల పైనా నాన్ బెయిలబుల్ కేసులునమోదు చేసి జైలుకు పంపుతామని ఎస్సై నరేష్ తెలియజేశారు.