- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అర్ధరాత్రి వింత శబ్దంతో గాలి దుమారం.. ఉల్కిపడ్డ గ్రామం

దిశ, అశ్వారావుపేట: అర్ధరాత్రి వింత శబ్దంతో వీచిన పెనుగాలి ఆ గిరిజన గ్రామములో ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా తీవ్రన్నష్టాన్ని మిగిల్చి వెళ్ళింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కన్నాయిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని గోపన్నగూడెంలో రాత్రి 12 గంటల సమయంలో భారీ పెనుగాలి దుమారం గ్రామస్తులను ఉలిక్కిపడేలా చేసింది. వింత శబ్దంతో టోర్నడోను తలపించే విధంగా భారీ సుడిగాలి గ్రామాన్ని చుట్టేసింది. దీంతో నిద్రలో ఉన్న వారంతా ఏం జరుగుతుందో తెలియక భయాందోళనకు గురయ్యారు. పెనుగాలి ధాటికి ఇళ్లపై కప్పులు, ప్రహరీలు దెబ్బతినగా.. ఇంటి ఆవరణలో పెంచుకున్న చెట్లతోపాటు జీడి మామిడి తోటలలోని చెట్లు నేలకూలాయి. విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో కన్నాయిగూడెం గ్రామ సర్పంచ్ గొంది లక్ష్మణరావు ఆధ్వర్యంలో పునరుద్ధరణ పనులను చేపట్టారు. ఇటువంటి వింత భారీ పెనుగాలులను మొట్టమొదటిసారి చూసామని గ్రామస్తులు వాపోయారు.