- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలి : మానవతారాయ్

దిశ, తల్లాడ : తల్లాడ మండలం రంగం బంజర రాష్ట్రీయ రహదారిపై తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతుల పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి కోటూరి మానవతారాయ్, లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు ధర్మసోత్ దశరథ్ నాయక్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి రోడ్డు పై బైఠాయించి ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా మానవతారాయ్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంను ప్రారంభించి నెల రోజులు అయినా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షాలతో ధాన్యం తడిసి రైతులకు తీవ్ర నష్టం కలిగిందని అన్నారు. రైతులను ఆదుకోకపోతే వారు ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. వెంటనే మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భం గా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో తల్లాడ స్థానిక పోలీసులు అక్కడకు చేరుకొని సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.