అతివేగంతో అదుపు తప్పిన కారు: వ్యక్తి మృతి

by Disha Web Desk 1 |
అతివేగంతో అదుపు తప్పిన కారు: వ్యక్తి మృతి
X

దిశ, కంటోన్మెంట్ / బోయిన్ పల్లి: అతివేగంతో కారు అదుపుతప్పి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై యుగేంధర్ కథనం ప్రకారం బీహార్ రాష్ట్రం గయాకు చెందిన గుడ్డు చౌదరి (40) గత కొద్ది సంవత్సరాల క్రితం భార్య సోనీ దేవి, ముగ్గురు కుమార్తెలతో కలిసి నగరానికి వచ్చి జీడిమెట్లలోని కంపెనీలో పని చేస్తున్నాడు. కాగా, భార్య సోనీదేవి ఇంటివద్దే ఉంటూ పిల్లల ఆలనా, పాలనా చూసుకుంటోంది. వీరి పెద్ద కుమారుడు వారి స్వగ్రామంలోని బంధువుల వద్ద ఉంటున్నారు. రోజులాగే సోమవారం ఉదయం గుడ్డుచౌదరి ఇంటి నుంచి కంపెనీకి సైకిల్ పై బయలు దేరాడు. డెయిరీ ఫామ్ క్రాస్ రోడ్డు సమీపంలోకి చేరుకోగానే, వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఒక్కసారిగా అదుపుతప్పి సైకిల్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన గుడ్డు చౌదరిని స్థానికులు చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. సోనీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించి దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed