- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మోసపోయిన మహారాష్ట్ర కూలీలు... మానవత్వాన్ని చాటిన స్థానికులు

దిశ, వైరా: కూలీ పని ఉందని చెప్పి పిలిపించిన వ్యక్తి ముఖం చాటు వేయడంతో మహారాష్ట్ర కూలీలు రోడ్డున పడ్డారు. తాము మోసపోయినట్లు గ్రహించిన ఆ కూలీలు తమ స్వస్థలానికి పంపాలంటూ వేడుకుంటున్న దయనీయ స్థితి చూసి పలువురు హృదయం చలించింది. ఈ విషయం తెలుసుకున్న వైరాలోని ఫ్రెండ్స్ రెస్టారెంట్ నిర్వాహకులు ముదిగొండ్ల మహేష్ స్పందించి వారికి కడుపునిండా అన్నం పెట్టారు. అదేవిధంగా వైరా బీఆర్ఎస్ నాయకులు పనితి సైదులుతోపాటు ఓ పత్రికా విలేకరి స్పందించి చార్జీలకు ఆర్థిక సాయం అందించి మానవత్వం చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరువూరుకు చెందిన ఓ వ్యక్తి కూలి పని ఉందని ఫోన్ చేసి మహారాష్ట్ర కూలీలను పిలిపించారు. ఆ కూలీలు తిరువూరు వెళ్ళాక సదరు వ్యక్తి ముఖం చాటేసాడు. దీంతో మోసపోయామని గ్రహించిన వారు వైరాకు వచ్చారు. వారి ధీన పరిస్థితిని తెలుసుకున్న ముదిగొండ మహేష్ వెంటనే వారికి ఆహారాన్ని అందించారు. మహారాష్ట్ర వరకు ఆరుగురు వ్యక్తులు వెళ్లేందుకు తమకు ఇంకా ఆర్థిక సాయం అవసరమని బాధితులు వేడుకుంటున్నారు. దాతృ స్వభావం ఉన్న వారు స్పందించి వారికి ఎంతో కొంత ఆర్థిక సాయం అందించగలరని నీ తోడు సంస్థ నిర్వాహకులు నందిగామ మనోహర్ కోరారు. ప్రస్తుతం ఆ కూలీలు వైరా బస్టాండ్ లో తలదాచుకున్నారు.