- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
బ్రిడ్జి నిర్మాణం దశాబ్దాల కలేనా...?

దిశ, అశ్వాపురం: మండల పరిధిలోని గొందుగూడెం తుమ్మలచెరువు గ్రామపంచాయతీలలో గల లోతు వాగు, ఇసుక వాగుల పై బ్రిడ్జిలు నిర్మాణం చేపట్టకపోవడంతో దశాబ్దాల కాలంగా ఆయా గ్రామ పంచాయతీల పరిధిలోని గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుమార్లు పినపాక నియోజకవర్గం నుండి ఎన్నికైన ఎమ్మెల్యేలు ఈ బ్రిడ్జిల నిర్మాణాలపై ఏమాత్రం శ్రద్ధ వహించక పోవడంతో ఆయా గ్రామపంచాయతీల పరిధిలో గిరిజనులు మోస్తరు వర్షాలు పడినా సరే వాగులు పొంగిపొర్లుతాయి. ఆ గ్రామపంచాయతీలో పరిధిలో గల గొందుగూడెం, ఎలకలగూడెం, ఎలకలగూడెం, కొత్తూరు, అనుభూతుల గూడెం మరికొన్ని వలస ఆదివాసీ గిరిజన గ్రామాలు కూడా ఉన్నాయి.
అలాగే తుమ్మలచెరువు గ్రామపంచాయతీ పరిధిలో గల రామవరం, కోరం వారి గుంపు, భీమవరం బండ్ల వారి గుంపు, వెంకటాపురం, మావిళ్ళవాయి గ్రామాలతోపాటు వలస ఆదివాసీ గిరిజన గ్రామాలు ఉన్నాయి. వాగులు పొంగి పొర్లితే ఉదయం నుండి సాయంత్రం వరకు రాకపోకలు నిలిచిపోతాయి. లేదంటే వరదల ఉధృతి తగ్గేంతవరకు ఆయా గిరిజన గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఎదురుచూడాల్సిందే. ఈ బ్రిడ్జి నిర్మాణాల ఏర్పాటు కోసం గిరిజనులు కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. దీంతో ఆయా గ్రామాల గిరిజనులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆ సమయంలో ఎవరికైనా జబ్బు చేసినా ప్రాణాల మీదకు వచ్చి హరిమానాల్సిందే. గొందిగూడెం పంచాయతీ పరిధిలోని గ్రామాల ప్రజలు పక్కనే ఉన్న రైల్వే బ్రిడ్జిపై నుండి ధైర్యం చేసి దాటడానికి ప్రయత్నం చేస్తారు. ఆ సమయంలో ఆ రైల్వే బ్రిడ్జి పై నుండి రైలు గానీ, గూడ్స్ బండి గానీ వస్తే వారి ప్రాణాలు గాల్లో కలవాల్సిందే. గిరిజనులు పడుతున్న తీవ్ర ఇబ్బందులపై మండల ప్రజా ప్రతినిధులు గానీ, నియోజకవర్గ ఎమ్మెల్యే గానీ గత ఎమ్మెల్యేలు కానీ ఈ బ్రిడ్జి నిర్మాణాలపై దృష్టి సారించి నిధులు మంజూరు చేయించి నిర్మాణాలు చేపడితే గిరిజనులు దశాబ్దాల కాలంగా ఎదురుచూస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.