మానవత్వం చాటుకున్న డాక్టర్ రమేష్...

by S Gopi |
మానవత్వం చాటుకున్న డాక్టర్ రమేష్...
X

దిశ, జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం అన్నారపాడు గ్రామానికి చెందిన ప్రముఖ సర్జన్ డా. బానోతు రమేష్ ప్రస్తుతం కృష్ణా జిల్లా తిరువూరులో వైద్యశాలను నడిపిస్తున్నాడు. జూలూరుపాడు మండల పరిసర ప్రాంత ప్రజలకు కూడా తిరువూరు అత్యవసర చికిత్సల కోసం వెళుతున్నారు. ఆపరేషన్ ఖర్చులను పేద, ధనికులను బట్టి తీసుకుంటాడు. ఈ క్రమంలో జూలూరుపాడు న్యూ కాలనీకి చెందిన వేమూరి కనకయ్య సతీమణి సరస్వతి తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతుండగా ఖమ్మం తీసుకువెళ్లి చూపించగా అర్జెంటుగా హైదరాబాద్ తీసుకెళ్లి మేజర్ ఆపరేషన్ చేయించాలని సూచించారు. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో కనకయ్య తన పూర్వ విద్యార్థి అయిన రమేష్ కి ఫోన్ చేసి విషయం చెప్పగా వెంటనే ఆపరేషన్ కు ఏర్పాట్లు చేశాడు ఆ డాక్టర్. సుమారు రెండు గంటలు శ్రమించి ఆపరేషన్ చేసి గురువు గారి సతీమణిని బతికించడంతో గురువు కనకయ్య, డాక్టర్ రమేష్ ను మనస్ఫూర్తిగా అభినందించాడు. ఈ సందర్భంగా వేమూరి కనకయ్య మాట్లాడుతూ ఇలాంటి పూర్వ విద్యార్థిదొరకడం పూర్వజన్మ సుకృతమని, తన భార్య సరస్వతిను బ్రతికించి ఉచితంగా ఆపరేషన్ చేసిన ఆ డాక్టర్ పై ప్రశంసలు కురిపించారు. విషయం తెలిసిన పలువురు డాక్టర్ ను అభినందిస్తున్నారు.



Next Story

Most Viewed