- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
బినామీగా మారిన విద్యుత్ ఏఈ... రూ. 5 వేలు సమర్పిస్తేనే పని లేకపోతే అంతే..

దిశ, ఖమ్మం రూరల్: అటెండర్ పని అటేండరే చేయాలి.. పై అధికారి పని పై అధికారే చేయాలి కానీ ఇక్కడ ఆ అధికారి మాత్రం అన్ని పనులు తానే చక్కబెడుతూ.. కోట్లు రుపాయలను అక్రమంగా సంపాదనతోపాటు నిబంధనలకు విరూద్ధంగా బినామీ కాంట్రాక్టర్ అవతారం కూడా ఎత్తిన రూరల్ మండల అరెంపుల విద్యత్ శాఖ ఏఈపై 'దిశ' ప్రత్యేక కథనం..
విద్యత్ఏఈనే బినామీ కాంట్రాక్టర్..?
ఆరెంపుల పరిధిలోని పలు వెంచర్లు నిర్మాణం జరుగుతున్నాయి. వాటిలో కరెంట్ నిర్మాణ పనులకు అంచనాలు తయారు చేసి టెండర్ ద్వారా కాంట్రాక్టర్కు అప్పగిస్తారు. కానీ ఇక్కడ పనిచేస్తున్న ఏఈ మాత్రం అంచనాలు తయారు చేసి ఫైల్ టేబుల్మీదకు రాగానే తానే స్వయంగా వెంచర్నిర్వాహకులకు ఫోన్చేసి తానే పనులు చేపిస్తానని, అందుకు కాసులు ముట్టజెప్పాల్సి ఉంటుందని హుకుం జారీ చేస్తాడు. దిక్కతోచని వెంచర్నిర్వాహకులు ఏఈనే చేస్తానని చెప్పుతున్నాడని అతను చెప్పినట్లుగానే డీడీలు తీసి పైన అమ్యామ్యాలు కూడా సమర్పిస్తారు. ఎస్టిమేషన్ వేసి అంచనాలు తయారు చేసిన కాంట్రాక్టర్ ను మాత్రం బ్లాక్లో పెట్టి తానే స్వయంగా ప్రైవేట్ మనుషులను పెట్టి పనులను చేస్తున్నాడు. నిబంధనలకు విరుద్ధంగా శాఖకు చెందిన మెటిరియల్ను సైతం వెంచర్లో నిర్మాణం చేస్తున్న కరెంట్ పనులకు వాడుతున్నాడని అరోపణలు సైతం ఉన్నాయి. ఇటీవల సదురు సార్మీద ఎంక్వైయిరీకి కూడా వస్తే పై అధికారులను మేనేజ్చేసినట్లు తెలిసింది. శ్రీసిటితోపాటు ఇతర వెంచర్లో నిర్మించిన ఇండ్లకు మీటరు బిగించాలంటే సారుకు రూ. 5 వేలు సమర్పిస్తేనే పని లేకపోతే అంతే.. ఇలా అక్రమార్జనకు పాల్పడిన ఏఈ బాగోతాలు అన్ని ఇన్నీకావు. ఇండస్ట్రీయల్ ఏరియాలో గ్రానైట్ ఫ్యాక్టరీకి కరెంట్సరఫరా కోసం రూ. లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు సైతం ఉన్నాయి. అరెంపులకు ముందు పనిచేసిన తిరుమాలయపాలెం మండలంలోని పాపాయిగూడెం పరిధిలో ఓ ఫాం ల్యాండ్కు నిబంధనలకు విరూద్ధంగా కరెంట్ ఇచ్చేందుకు సదురు ఏఈనే భేరం కూదుర్చుకుని రూ. లక్షల్లో డీల్ కుదుర్చకున్నట్లు అరోపణలు సైతం ఉన్నాయి. అసలు కన్వర్షన్ లేని ల్యాండ్కు ఎలా కరెంట్సరఫరా ఇచ్చాడో అధికారులు విచారణ చేస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
కేవలం అనతికాలంలోనే రూ. కోట్ల ఆస్తుల సంపాదనపై అరోపణలు
కేవలం అనతికాలంలోనే ఖమ్మంలోని రూ. కోట్ల విలువ చేసే బంగ్లాను సైతం ఇటీవలే కొనుగోలు చేసినట్లు తెలిసింది. దీంతోపాటు ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లి రెవెన్యూ పరిధిలోని ఇటీవలే రూ. కోట్లు విలువ చేసే స్థలం సైతం కొనుగోలు చేసినట్లు అరోపణలు ఉన్నాయి. కేవలం ఏఈగానే పనిచేస్తూ తక్కువ టైంలో రూ. కోట్లు ఎలా సంపాదించాడనే దానిపై ఏసీబీ అధికారులు దాడులు చేస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. 100శాతం టన్ క్కి డిపార్ట్మెంట్మేటిరియల్వాడినా కూడా పై అధికారులు పట్టించుకోలేదు.