- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మృత్యుశాలగా మారిన శ్రీచైతన్య కాలేజీ..?

దిశ, ఖమ్మం సిటీ: ఖమ్మంలోని శ్రీచైతన్య కాలేజ్ సిబ్బంది తీరుతో విద్యార్ధులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కాలేజీ యాజమాన్యం, సిబ్బంది విద్యార్ధులను ప్రతి రోజు వేధించడంతోపాటు అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రతిసారి శ్రీచైతన్య కాలేజీలో విధ్యార్ధులు ఆత్మహత్యయత్నాలకు, ఆత్మహత్యలకు పాల్పడటంతోపాటు హత్యాయత్నాలకు పాల్పడిన ఘటనలూ జరుగుతున్నాయి. ముక్కు పచ్చలారని విద్యార్థులు శ్రీచైతన్య కాలేజీ పెడుతున్న ఒత్తిడి, వేధింపుల వల్ల ప్రాణాలు పోగొట్టుకుంటున్న దాఖలాలు ప్రతి రోజు దర్శనమిస్తున్నాయి. కాలేజీలో లిఫ్ట్ సౌకర్యం లేదు. కనీసం విద్యార్ధులకు సౌకర్యాలు లేవు. అయినా కానీ ఫీజుల దోపిడీ విపరీతంగా ఉంటుంది. అధికంగా వసూలు చేస్తున్న ఫీజుల వల్ల విద్యార్థులు తల్లిదండ్రులకు తమ గోడును వెల్లబుచ్చుకోలేక ఆత్మహత్యలే శరణ్యమంటూ బల్వన్మరణాలకు పాల్పడుతున్నట్లు విద్యార్థి సంఘ నాయకులు, బాధిత కుటుంబీకులు వాపోతున్నారు.
కళాశాల నిర్వహించేటప్పుడు ఆ కళాశాలకు గల క్రీడా ప్రాంగణం, భవన నిర్మాణం మొత్తం ప్రభుత్వ నిబంధనలకు అనుకూలంగా నిర్మించి ఆ భవనం చుట్టూ అగ్నిమాపక యంత్రాలు, ఫెన్సింగ్ వైర్లు కట్టి విద్యార్థులకు రక్షణ కల్పించాల్సి ఉంటుంది కానీ, ఇవేమీ పట్టని శ్రీచైతన్య యాజమాన్యం తమ ప్రతిభను గొప్పగా చూపిస్తూ విద్యార్థుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి అని విద్యార్థులు వాపోతున్నారు. ఆదివారం ఓ విద్యార్థిని బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీసీ గ్రూప్ చదువుతున్న చైతన్య(17) అనే విద్యార్థిని కాలేజీలో రెండో అంతస్తు నుండి కిందికి దూకింది. వెంటనే కళాశాల యాజమాన్యం నగరంలోని కిమ్స్ హాస్పిటల్ కి తరలించారు. విద్యార్థిని చైతన్యకు తీవ్రగాయాలు లైనట్టు విద్యార్థులు తెలిపారు. కాలేజీలో టీచర్ మందలించినట్టు విద్యార్థులు తెలుపుతున్నారు. మరణించిన విద్యార్థిని నేలకొండపల్లి వాసిగా గుర్తించారు. శ్రీ చైతన్య కళాశాలలో ఇలాంటి సంఘటనలు ఇప్పటివరకు మూడు జరిగాయని విద్యార్థులు తెలుపుతున్నారు. కళాశాల యాజమాన్యం ఫీజులు వేధిస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. అయినా కానీ అధికారులు ఈ కాలేజీ పై చర్యలు తీసుకోవడం కానీ, సోదాలు నిర్వహించడం కానీ చేయడం లేదు. దీనికి వెనుక భారీగా ముడుతున్న ముడుపులే అనేది బహిరంగ రహస్యం.
శ్రీ చైతన్య కళాశాలపై చర్యలు తీసుకోవాలి: బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షులు షేక్ బాజీ బాబా
శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని భవనం రెండో అంతస్తు నుండి దూకి ఆత్మహత్యా ప్రయత్నం చేయడం పట్ల బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు షేక్ బాజీ బాబా విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం లెక్చరర్లు మందలించటం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందన్నారు. రూ. లక్షల ఫీజు వసూలు చేస్తున్న శ్రీచైతన్య యాజమాన్యం భవనానికి కనీసం రక్షణ వలయం ఏర్పాటు చేయకపోవడం వల్ల విద్యార్థిని రెండు అంతస్తుల పై నుండి దూకి ఆత్మహత్యాయత్నం చేయడం జరిగిందన్నారు. కనీసం నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా నడుపుతున్న శ్రీచైతన్య కళాశాల గుర్తింపును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ స్థాయిలో ఫీజులు వసూళ్లతో పేద విద్యార్థులు బలవుతున్నారని ఆయన విచారణ వ్యక్తం చేశారు.