అలరించిన టీఎల్ఎం మేళా...

by S Gopi |
అలరించిన టీఎల్ఎం మేళా...
X

దిశ, దమ్మపేట: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు కనీస అభ్యసన సామర్ధ్యాలు పెంపొందించేదుకు తీసుకొచ్చిన తొలిమెట్టు కార్యక్రమం, అందులో భాగంగా బోధనోపకరణాలతో విద్యార్థులకు బోధించే(టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్) కార్యక్రమాన్ని మంగళవారం దమ్మపేట గిరిజన గురుకుల పాఠశాలలో అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా 100 ప్రాథమిక పాఠశాలలో నుండి విద్యార్థులకు బోధించేందుకు తయారుచేసిన బోధనాపకరణాల ప్రదర్శనను ఆయన తిలకించారు. ఉపాధ్యాయులు బోధించే విధానాన్ని ఎమ్మెల్యేకి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ తక్కువ ఖర్చులో విద్యార్థులకు ఎక్కువ అభ్యాసన అనుభవాలు విద్యార్థులకు కల్పించవచ్చని, విద్యార్థులకు బోధనాపకరణాల ద్వారా బోధించడం ద్వారా సులువుగా విద్యను నేర్చుకుంటారని, త్వరగా అర్థమవుతుందని, శాశ్వతంగా గుర్తుంటుందని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు వారి యొక్క అభ్యసన సామర్ధ్యాలను పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. అనంతరం భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘ సేవకురాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సావిత్రిబాయి పూలే పురస్కరించుకుని జరుపుకునే మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా మండలంలోని మహిళా ఉపాధ్యాయురాలును ఎమ్మెల్యే శాలువాలతో సన్మానించారు. అనంతరం అక్కడ గురుకుల పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం అందించే బ్యాగులు, దుప్పట్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, ఎంపీపీ సోయం ప్రసాద్, వైస్ ఎంపీపీ దారా మల్లికార్జునరావు, ఎంఈఓ కీసర లక్ష్మి, ఎంపీడీవో చంద్రశేఖర్, ఎఫ్ఎల్ఎన్ మండల నోడల్ ఆఫీసర్ జగపతి, జిల్లా టీఎల్ఎం పరిశీలికులు నాగరాజు, సైదులు గురుకుల పాఠశాల కళాశాల ప్రిన్సిపల్ శ్యాం కుమార్, సర్పంచ్లు ఉయ్యాల చిన్న వెంకటేశ్వర్లు, మడివి దుర్గా, టీఆర్ఎస్ నాయకులు యార్లగడ్డ బాబు, చామర్తి గోపి శాస్త్రి, అబ్దుల్ జిన్నా, మండలంలోని ప్రాథమిక పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.



Next Story