జనవరి 8న జరిగే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి: కిరణ్

by S Gopi |
జనవరి 8న జరిగే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి: కిరణ్
X

దిశ, సత్తుపల్లి: జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూ, వారికి అండగా నిలుస్తున్న టి.యు.డబ్ల్యూ.జె యూనియన్ రాష్ట్ర మహాసభలు జనవరి 8న హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు జిల్లా కోశాధికారి తోట కిరణ్ తెలిపారు. గురువారం స్థానిక కళాభారతిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటికే జిల్లా మహాసభలు పూర్తిచేసుకుని కార్యవర్గం ఏర్పాటు చేసుకున్నామన్నారు. త్వరలోనే సత్తుపల్లి డివిజన్ కమిటీని కూడా ప్రకటించబోతున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర మహాసభలకు సత్తుపల్లి డివిజన్ నుంచి పెద్ద సంఖ్యలో జర్నలిస్టు రావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ఈసీ మెంబర్ ఓబిలిసెట్టి రామరావు, డివిజన్ నాయకులు జెమ్ముల రాజేష్ రెడ్డి, బొల్లిపోగు సురేష్, పురేటి శ్రీనివాస్, నల్లంటి మోహన్, మాచినేని రాజ, ఈదుల రమేష్, జోలపల్లి శ్రీనివాస్, ఐ. శ్రీనివాస రావు, ఎండీ రఫీ, బండారు ఉమ, మేహరాజ్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed