- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సహకార సంఘాల అభివృద్ధికి విశేష కృషి

డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం
దిశ గుండాల: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సహకార సంఘాల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నట్టు జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ కూరాకుల నాగభూషణం తెలిపారు.శనివారం మండల పరిధిలో పర్యటించిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 56 సొసైటీలో రూ.26 కోట్లతో గోదాముల నిర్మాణం చేపట్టినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా బిల్డింగ్ వసతులు లేని గుండాల సహకార సంఘానికి బిల్డింగ్ వసతి కల్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. డీసీసీడీలో మొత్తం రూ.1,028 కోట్ల డిపాజిట్లు, రూ.1,680 కోట్లు వివిధ స్కీముల ద్వారా రుణాలు చెల్లించినట్లు ఆయన తెలిపారు. జిల్లావ్యాప్తంగా విద్యా రుణాల ద్వారా నిరుపేదలైన 700 మంది విద్యార్థులకు రూ.70 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. గోల్డ్ లోన్ కింది రూ.386 కోట్లు రుణాలు అందించామన్నారు. అదనంగా భూ తనకాలు మరియు ఇతరములకు లోన్లు రూ.286కోట్లు రుణాలు చెల్లించామని ఆయన తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 100 సహకార సంఘాలు 50 కో ఆపరేటివ్ బ్యాంకులతో దినదినాభివృద్ధి చెందుతుందన్నారు. అదేవిధంగా ఎక్కడ లేని విధంగా హెచ్ఆర్ పాలసీ కూడా అమలు చేశామని ఉద్యోగులు కూడా సంఘ అభివృద్ధికి బ్యాంకుల అభివృద్ధి కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు. సహకార సంఘ అధ్యక్షులకు గ్రేడ్లను బట్టి వేతనాలు చెల్లించనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు డీసీసీడీలో రూ.2,700కోట్ల టర్నోవర్ తో కొనసాగుతోందని తెలిపారు. అదేవిధంగా రూ.25వేల లోపు రుణం పొందిన రైతులకు రూ.26 కోట్లు రుణమాఫీ వారి ఖాతాలో జమ చేశామని, రూ.50వేల లోపు రుణం పొందిన వారికి రుణమాఫీ రూ.63 కోట్లతో రుణమాఫీ చేసినట్లు ఆయన తెలిపారు. సకాలంలో రుణాలు చెల్లిస్తే 3 శాతం వడ్డీ రాయితీ లభిస్తుందన్నారు. అనంతరం ఆయన కోపరేటివ్ బ్యాంక్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ జనగం కోటేశ్వరరావు. గుండాల సొసైటీ అధ్యక్షులు గుగ్గల రామయ్య, ఈసం పాపారావు, బ్యాంక్ మేనేజర్ నామా నాగరాజు, తదితరులు పాల్గొన్నారు