- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
తల్లిని హత్య చేసిన తనయుడు అరెస్ట్
by Sridhar Babu |

X
దిశ,ఇల్లందు : మండల పరిధిలోని మోదుగులగూడెం గ్రామానికి చెందిన మెరుగు పద్మ హత్య కేసులో తనయుడు మెరుగు యాకయ్య ను అదుపులోకి తీసుకున్నట్లు ఇల్లందు సీఐ టి. కరుణాకర్ తెలిపారు. ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో జీవనం కొనసాగిస్తున్న మెరుగు యాకయ్య గత
రెండు రోజుల క్రితం తన స్వగ్రామమైన మోదుగుల గూడెంకు వచ్చాడు. దీంతో ఆస్తి కోసం ఇరువురి మధ్య ఘర్షణ జరిగినట్లు తెలిపారు. కోపంతో యాకయ్య రోకలిబండతో పద్మ తలపై మోదడం వల్ల అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. పద్మ మృతిపై విచారణ చేపట్టిన పోలీసులు తనయుడే నిందితుడని నిర్ధారణ కావడంతో కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించడం జరుగుతుందని పోలీసులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎస్ఐ, ఏఎస్ఐ లు శ్రీనివాస్, అబ్దుల్ ఘని పాల్గొన్నారు.
Next Story