ఖమ్మం డీఈఓగా సోమశేఖరశర్మ

by Sridhar Babu |   ( Updated:2022-12-14 15:50:40.0  )
ఖమ్మం డీఈఓగా సోమశేఖరశర్మ
X

దిశ, ఖమ్మం కల్చరల్ : ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారిగా సోమశేఖర్ శర్మను నియమిస్తూ విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం జిల్లా డీఈఓ యాదయ్య సెలవుపై వెళ్లినందున ఈ నియామకాన్ని చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం డీఈఓగా విధులు నిర్వహిస్తున్న సోమశేఖర శర్మను ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారిగా నియమించారు. జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ వేధింపులు తట్టుకోలేక జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య సెలవు పై వెళ్లినట్లు తెలుస్తుంది. సోమశేఖర్ శర్మ నియామకంతో విద్యాశాఖ కార్యక్రమాలు సజావుగా నడిచేందుకు ఈ ఉత్తర్వులు జారీ చేసినట్టు సమాచారం. ఖమ్మం జిల్లాలో వైజ్ఞానిక ప్రదర్శనలు జరుగుతుండగా జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య సెలవుపై వెళ్లడంతో డైట్ కాలేజ్ ప్రిన్సిపాల్ సత్యనారాయణకు అదన బాధ్యతలు అప్పగించారు. జిల్లా లోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సామర్థ్యాలను పెంచేందుకు ఎఫ్ఎల్ఎన్ తొలి మెట్టు కార్యక్రమం జరుగుతుండగా కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారిని ప్రత్యేకంగా నియమించినట్లు తెలుస్తుంది.



Next Story