ఇల్లందు ఏరియాలో సింగరేణి డైరెక్టర్ల పర్యటన

by Sridhar Babu |
ఇల్లందు ఏరియాలో సింగరేణి డైరెక్టర్ల పర్యటన
X

దిశ, ఇల్లందు : ఇల్లందు ఏరియాలో డైరెక్టర్ (ఆపరేషన్స్​) ఎన్ వీ కే. శ్రీనివాస్, డైరెక్టర్ (పి.పి) జి. వెంకటేశ్వర రెడ్డి పర్యటించారు. వారు ఏరియాలోని జేకే ఉపతల గని వ్యూ పాయింట్ నుండి గనిలోని పని ప్రదేశాలను పరిశీలించారు. ఇంకా జేకే 5 గనిలో మిగిలి ఉన్న బొగ్గు నిక్షేపాల విలువల గురించి ఏరియా జనరల్ మేనేజర్ ఎం. షాలెం రాజును అడిగి తెలుసుకున్నారు.

రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించి సంస్థ పురోగతికి పాటుపడాలని కోరారు. అనంతరం వారు జీఎం కార్యాలయంలో నూతన జేకే ఓసీ పనుల పురోగతి పై సమీక్ష సమావేశం నిర్వహించి సంబంధిత అధికారులకు తగు సలహాలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓటు జీఎం మల్లారపు మల్లయ్య, ప్రాజెక్ట్ ఆఫీసర్ బొల్లం వెంకటేశ్వర్లు, గని మేనేజర్ పూర్ణ చందర్, సేఫ్టీ ఆఫీసర్ శివప్రసాద్, అసిస్టెంట్ మేనేజర్లు కిషన్, నాగ రమేష్, మైన్ సర్వే అధికారి నాగేశ్వరరావు,సెక్యూరిటీ అధికారి అంజి రెడ్డి,ఇతర అధికారులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed