- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మహిళలపై అఘాయిత్యాలకు వ్యతిరేకంగా నిరసన.. ఎంపీ ఆధ్వర్యంలో మౌన దీక్ష
by Javid Pasha |

X
దిశ, కారేపల్లి : రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను నిరసిస్తూ బుధవారం హైదరాబాద్లో గాంధీభవన్లో మాజీ ఎంపి రేణుకా చౌదరి ఆధ్వర్యంలో మౌన దీక్షను చేసినట్లు రాష్ట్ర కాంగ్రెస్ మహిళా ఉపాధ్యక్షురాలు పగడాల మంజుల తెలిపారు. దోషులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, మహిళలపై లైంగిక దాడుల నివారణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ డీజీపీకి వినతిపత్రం అందజేస్తునట్లు తెలిపారు. దోషులకు సరైన శిక్షలు పడకనే మహిళలపై దాడులు పెరుగుతున్నాయని మంజుల తెలిపారు. దోషులు మంత్రి బంధువులు కావటంతోనే పోలీసులు కేసును నీరుగార్చే పని చేస్తున్నారని ఆరోపించారు. బాధిత బాలికలకు న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆపేది లేదని ఆమె అన్నారు.
Next Story