ఘనంగా శ్రావణమాస బోనాల జాతర

by Sridhar Babu |
ఘనంగా శ్రావణమాస బోనాల జాతర
X

దిశ, పాల్వంచ టౌన్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పాత పాల్వంచ గడియకట్ట లోని శ్రీ మైసమ్మతల్లి దేవాలయం లో శ్రావణమాస బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. శ్రావణమాసపు మొదటి ఆదివారం దేవాలయంలో జాతర నిర్వహించడం ఆనవాయితీ. తెల్లవారుజాము నుండే పూజారులు సుమన్ శాస్త్రి, పవన్ శాస్త్రి ల ఆధ్వర్యంలో అభిషేకాలు, పూజలు చేశారు.

అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం అమ్మవారిని పాత పాల్వంచ పురవీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావుతో పాటు డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అమ్మ వారి ఊరేగింపు పల్లకిని మోసి, ప్రత్యేక పూజలు చేశారు. బోనాల జాతర సందర్భంగా అమ్మవారికి సాయి బాబా దేవాలయ నిర్వాహకులు ముత్యాల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి చీర, సారె బహూకరించారు.

బోనమెత్తిన కొత్వాల

ఈ సందర్భంగా మహిళలు బోనాలు ఎత్తుకెళ్లి, అమ్మవారికి సమర్పించగా డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు బోనం ఎత్తుకొని ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కొత్వాల సత్యనారాయణ, బీఆర్​ఎస్ పట్టణ అధ్యక్షులు మంతపురి రాజు గౌడ్, కమిటీ సభ్యులు మనసం శరత్, వంగా రమేష్, బర్ల పాపారావు, అగ్నిమండల భాస్కర్,

మంగ్యా నాయక్, గడదాసి వెంకటేష్,కోసూరి కిరణ్ కుమార్, కొండపల్లి నాగరాజు, కిలారి సుజాత, ముత్యాల కోటేశ్వరరావు, పాశం నాసరయ్య, బొందిలి శేషగిరి, పెద్దింటి రాంబాబు, పుప్పాల కృష్ణ, వెలివెంటి సుబ్రహ్మణ్యం, సతీష్, చిన్న పండు, కట్ట శ్రీను, చావా వెంకటేశ్వరరావు, కట్ట నరసింహరావు, పిల్లల గంగాధర్, గుడిపాటి నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.



Next Story