మున్సిపల్ వైస్ చైర్మన్ కి బాసటగా 14 మంది కౌన్సిలర్లు..

by Sumithra |
మున్సిపల్ వైస్ చైర్మన్ కి బాసటగా 14 మంది కౌన్సిలర్లు..
X

దిశ, ఇల్లందు : మున్సిపల్ వైస్ చైర్మన్ సయ్యద్ జానీ పాష పై మున్సిపల్ చట్టం 2019 ప్రకారం కలెక్టర్ కార్యాలయం నుండి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సఫాయి అన్నకు సలాం, సఫాయి అమ్మకు సలాం అనే కార్యక్రమం జూన్ 19న మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఆ కార్యక్రమానికి వైస్ చైర్మన్ జానీకి సమాచారం లేదని జానీ కమిషనర్ ను కార్యక్రమంలో నిలదీశారు. అంతేకాక మున్సిపాలిటీలో జరుగుతున్న ఏ కార్యక్రమానికి కూడా సమాచారం ఇవ్వడం లేదని మున్సిపల్ కమిషనర్ ని నిలదీశారు. ఆ విధంగా మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్, వైస్ చైర్మన్ లకు మధ్య మాట పెరిగి వివాదం జరిగింది.

మున్సిపల్ కమిషనర్ అంకుషావలి ఈ విషయం పై కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. కమిషనర్ ను అవమానపరిచిన విషయం పై వివరణ ఇవ్వాల్సిందిగా వైస్ చైర్మన్ జానికి కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీనికి బాసటగా వైస్ చైర్మన్ జానీకి మద్దతుగా 14 మంది కౌన్సిలర్ల సంతకాలతో కూడిన పత్రాన్ని కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు. అంతేకాక మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు మున్సిపాలిటీ లో వైస్ చైర్మన్ పై కమీషనర్ కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన విషయాన్ని తెలియజేశారు. ఈ విషయం పై మున్సిపల్ వైస్ చైర్మన్ జానీని దిశ వివరణ కోరగా కలెక్టర్ కార్యాలయం నుండి షోకాజ్ నోటీస్ వచ్చింది నిజమేనని, తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో సఫాయి అన్నకు సలాం సఫాయి అమ్మకు సలాం అనే కార్యక్రమానికి తనకు ఆహ్వానం ఇవ్వలేదని అడిగానే తప్ప కమిషనర్ ను దూషించలేదని, షోకాజ్ నోటీస్ పై కలెక్టర్ కార్యాలయంలో వివరణ ఇచ్చారని తెలిపారు.



Next Story