- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ప్రజా సమస్యలను గాలికొదిలి తెలంగాణ దశాబ్ది సంబరారాలా ?

దిశ,మణుగూరు/అశ్వాపురం : ప్రజా సమస్యలను గాలికొదిలి తెలంగాణ దశాబ్ది సంబరారాలా అంటూ సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా నేతలు ప్రశ్నించారు. అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, వితంతు, వృద్ధాప్య పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు, ఇంటి స్థలాలు అందజేయాలని సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నూఫా భాస్కర్, అశ్వాపురం మండల ఆర్గనైజర్ కాంపాటి జీవన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం అశ్వాపురం మండల కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహసీసిల్దార్ కి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...అనేక మంది పేదలు ఇంటి స్థలాలు లేక, సరైన ఇండ్లు లేక, అర్హత కలిగిన వారందరికీ వితంతు,వృద్ధాప్య పెన్షన్లు, రేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం సమస్యలను గాలికొదిలి తెలంగాణ దశాబ్ది సంబరాల పేరుతో కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తుందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజా సమస్యలపై దృష్టిసారించాలని కోరారు. సమస్యలను పరిష్కరించకపోతే తమ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా మణుగూరు డివిజన్ కార్యదర్శి ఆర్.మధుసూదన్ రెడ్డి, డివిజన్ నాయకులు ఆర్.సాంబిరెడ్డి, అశ్వాపురం మండల నాయకులు కోళ్ల వెంకటేశ్వర్లు, పడిగ రాములు, ఎన్.రాజశేఖర్ రెడ్డి, ప్రగతిశీల యువజన సంఘం మండల నాయకులు తాటి నరేష్, మడకం రాజు, భీమయ్య, ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు కీర్తి, శైలజ, గౌస్ తదితరులు పాల్గొన్నారు.