- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
సీతమ్మసాగర్ కరకట్ట పనులను అడ్డుకున్న భూనిర్వాసితులు

దిశ, దుమ్మగూడెం : మండల పరిధిలోని సీతానగరంలో సోమవారం సీతమ్మసాగర్ ప్రాజెక్టు కరకట్ట పనులను భూ నిర్వాసితులు, స్థానిక నాయకులతో కలిసి అడ్డుకున్నారు. కరకట్ట కోసం వ్యవసాయ భూమిని కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా బలవంతంగా భూమిని తవ్వే ప్రయత్నాలను ఆదివాసీ సంక్షేమ పరిషత్ భద్రాచలం డివిజన్ అధ్యక్షుడు సోందే మల్లు దొర, పర్ణశాల సర్పంచి తెల్లం వరలక్ష్మి, ఉపసర్పంచ్ ఖాదర్ బాబు, ఆదివాసీ నాయకులు వాగే రాజేశ్వరి నిర్వాసిత రైతులతో కలిసి అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా మల్లుదొర మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు పనులు జరిగే స్థలానికి వచ్చి భూ నిర్వాసితులకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు జరిగే అన్యాయంపై ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా రెవెన్యూ శాఖ వారు లెక్కచేయకుండా పనులకు అనుమతిస్తున్నారని విమర్శించారు. రైతులు ప్రోక్లైన్లను అడ్డుకొని పనులు జరగనివ్వకుండా ఆపించి మరలా పనులు మొదలు పెట్టవద్దని ప్రాజెక్ట్ ఇంజనీర్లను హెచ్చరించారు. భూ నిర్వాసితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగే విధంగా చూడకుండా మళ్లీ పనులు మొదలుపెడితే తీవ్ర పరిణామాలను దారితీస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ ధర్నాలో స్థానిక రైతులు, భూనిర్వాసితులు, నాయకులు పాల్గొన్నారు.