- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
అక్రమంగా తరలిస్తున్న 108 కిలోల గంజాయి పట్టివేత

దిశ,ఇల్లందు : అక్రమంగా తరలిస్తుండగా పక్కా సమాచారం మేరకు దాడులు చేసి 108 కిలోల గంజాయిని పట్టుకొని ఒకరిని అరెస్ట్ చేసిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. ఇల్లందు సీఐ వి.రాజశేఖర్ స్థానిక ఎక్సైజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. భద్రాచలం నుంచి వరంగల్ వైపు గంజాయి తరలిస్తున్నట్లు పక్కా సమాచారం మేరకు బొజ్జాయి గూడెం సమ్మక్క- సారలమ్మ గద్దెల వద్ద వాహనాలను తనిఖీ చేశారు. హర్యానా రిజిస్ట్రేషన్ తో ఒక కారు రావడంతో అనుమానం వచ్చి ఆపి తనిఖీలు చేయగా కారు సిటు కింద డిక్కీలో 37 గంజాయి ప్యాకెట్లు ఉన్నాయి. వీటిలో 5 కిలోల గంజాయి ప్యాకెట్లు 10, 2 కిలోల గంజాయి ప్యాకెట్లు 27 ఉన్నాయి. ఒరిస్సా లో కిలో గంజాయిని రూ.6 వేలకు కొనుగోలు చేసి హర్యానాలో కిలో రూ.20 వేలకు విక్రయిస్తున్నారు.
గంజాయి తరలిస్తున్న బబ్లూ కుమార్ పేరుపైనే కారు రిజిస్ట్రేషన్ అయినట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. గంజాయిని ఎవరైనా అక్రమ రవాణా చేసినా, విక్రయాలు జరిపినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా గంజాయి విక్రయాలు, రవాణా చేస్తున్నట్లు తెలిస్తే ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. నిందితుడు బబ్లూ కుమార్ ని జ్యూడిషియల్ రిమాండ్ కు పంపనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ ఎస్ఐ సమీ ఉల్లా ఖాన్,హెడ్ కానిస్టేబుల్ రవి, కానిస్టేబుల్ లు పాషా, బాబు, మల్లికార్జున్, తులస్యా, బాబా పాల్గొన్నారు.