భద్రతపై అవగాహనా సదస్సు

by Disha Web Desk 15 |
భద్రతపై అవగాహనా సదస్సు
X

దిశ, ఇల్లందు : సింగరేణి సంస్థ ఇల్లందు ఏరియాలో సివిల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రక్షణ వారోత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా శనివారం కొత్తగూడెం ఏరియా రక్షణ కమిటీ కన్వీనర్ కొత్తగూడెం ఏరియా సేఫ్టీ ఆఫీసర్ జీవీ కోటిరెడ్డి నేతృత్వంలో సేఫ్టీ కమిటీ సభ్యులు ఇల్లందు ఏరియాలో పర్యటించి సివిల్ పనులు, వారు పాటిస్తున్న రక్షణ చర్యలపై తనిఖీ నిర్వహించారు.

అనంతరం భద్రతపై అవగాహన కల్పించారు. రక్షణ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, పని ప్రదేశంలో తప్పనిసరిగా రక్షణ సూత్రలు పాటించాలని సూచించారు. సింగరేణి ఉద్యోగులకు, కాంట్రాక్టు కార్మికులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు ఏరియా సేఫ్టీ ఆఫీసర్ పంజాల శ్రీనివాస్, జేకేఓసీ మేనేజర్ పూర్ణచందర్, శివప్రసాద్, సేఫ్టీ ఆఫీసర్ ఆర్ వెంకటేశం, ఈ.ఈ సివిల్ రాజారాం , దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.


Next Story

Most Viewed