ప్రైవేట్ వ్యక్తులతో పారిశుద్ధ్య పనులు

by Sridhar Babu |
ప్రైవేట్ వ్యక్తులతో  పారిశుద్ధ్య పనులు
X

దిశ, కూసుమంచి : గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు తమ న్యాయబద్ధమైన డిమాండ్ల కోసం గత 17 రోజుల నుండి సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కూసుమంచి మండల కేంద్రంలో పలు వీధులలో చెత్తాచెదారం చేసి దుర్వాసన వెదజల్లడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దీంతో కూసుమంచి గ్రామపంచాయతీ కార్యదర్శి గోదాల శంకర్, సర్పంచ్ చెన్న మోహన్ రావు ఆధ్వర్యంలో ప్రైవేట్ వ్యక్తులను రంగంలోకి దింపి పలు వీధులలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి పారిశుద్ధ్య పనులను సమర్థవంతంగా పూర్తిస్థాయిలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలు తమ ఇళ్లలోని చెత్తాచెదారాన్ని రోడ్లపై పడవేయరాదని అన్నారు.



Next Story

Most Viewed