11వ రోజుకు చేరుకున్న పారిశుద్ధ్య కార్మికుల సమ్మె.. రహదారి పై రాస్తోరోకో..

by Sumithra |
11వ రోజుకు చేరుకున్న పారిశుద్ధ్య కార్మికుల సమ్మె.. రహదారి పై రాస్తోరోకో..
X

దిశ, కూసుమంచి : తమ సమస్యలను పరిష్కరించాలని గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికులు చేపట్టిన సమ్మె సోమవారం నాటికి 11వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కార్మికులు కూసుమంచి మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయం నుండి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం ఖమ్మం సూర్యాపేట రహదారి పై కూర్చొని రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ న్యాయబద్ధమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ రోడ్డుపై బైటాయించి రాస్తారోకో నిర్వహించారు.

కరోనా విపత్కర పరిస్థితులలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పారిశుద్ధ్యన్ని సమర్థవంతంగా నిర్వహించామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ న్యాయబద్ధమైన డిమాండ్లను నెరవేర్చేంతవరకు సమ్మె కొనసాగిస్తామని తెలిపారు. మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమ్మె కొనసాగిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఐఎఫ్టీయూ నాయకులు ఇరుగు వెంకన్న, వివిధ ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపారు. దింతో రహదారి పై రాకపోకలు సాగించే వాహనాలకు అంతరాయం కలిగింది.



Next Story

Most Viewed