- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పంచాయతీ కార్యదర్శిని అడ్డుకున్న పారిశుద్ధ్య కార్మికులు
by Sridhar Babu |

X
దిశ, కూసుమంచి : రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు తమ న్యాయ బద్ధమైన డిమాండ్ల కోసం చేస్తున్న సమ్మె 10 వ రోజుకు చేరింది. ఇందులో భాగంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించడంతో కూసుమంచి గ్రామపంచాయతీ కార్యదర్శి శంకర్ ఆదివారం తాత్కాలిక కార్మికులను ఏర్పాటు చేసి చెత్త తరలించేందుకు ప్రయత్నించగా సమ్మె చేస్తున్న గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు కార్యదర్శిని, తాత్కాలిక కార్మికులను అడ్డుకున్నారు.
దీంతో కార్మికులకు పంచాయతీ కార్యదర్శికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తాము కరోనా వంటి ఆపత్కాలంలోనూ పారిశుద్ధ్య పనులు చేశామని తెలిపారు. అయినా తమను ప్రభుత్వం పట్టించుకోకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. తమకు సహకరించాలని కార్యదర్శిని వేడుకున్నారు. దీంతో కార్మికులు శాంతించక పోవడంతో ట్రాక్టర్ ను గ్రామపంచాయతీకి తరలించారు.
Next Story