జర్నలిస్ట్ రమేష్ కు రైతు నేస్తం పురస్కారం

by Nagaya |
జర్నలిస్ట్ రమేష్ కు రైతు నేస్తం పురస్కారం
X

దిశ, కామేపల్లి : ప్రముఖ సామాజికవేత్త, సీనియర్ జర్నలిస్ట్ చిలుముల రమేష్ కు "రైతు నేస్తం" పురస్కారం దక్కింది. హైదరాబాద్ లో ఆదివారం మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు చేతుల మీదుగా రైతు నేస్తం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈ పురస్కారాన్ని రమేష్ కు అందజేసి అభినందించారు. రమేష్ కు వరుసగా తొమ్మిది అవార్డులు రావడం ప్రశంసనీయమని ఫౌండేషన్ నిర్వాహకులు అన్నారు. రమేష్ కు అరుదైన గౌరవం లభించడంపై కామేపల్లి మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.



Next Story