- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పెంచిన బస్ చార్జీలు తగ్గించాలి.. ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

దిశ, ఇల్లందు : భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు ఆధ్వర్యంలో.. పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. గురువారం ఇల్లందులో బుగ్గవాగు సమీపంలోని భగత్ సింగ్ సెంటర్లో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. జనార్దన్ మాట్లాడుతూ.. నెల రోజులు గడవక ముందే రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఆర్టీసీ చార్జీలు పెంచి ప్రజలపై పెనుభారం మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుతో సతమతమవుతుండగా మళ్ళీ ఆర్టీసీ చార్జీలు పెంచడం మూలంగా మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైందని అన్నారు. వెంటనే పెంచిన ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తోడేటి నాగేశ్వరరావు, కొప్పుల శ్రీనివాస్, మోత్కూరి మల్లికార్జునరావు, కోటిలింగం, రామిశెట్టి నరసింహారావు, వెంకన్న, మోహన్ రావు, వినోద్ తదితరులు పాల్గొన్నారు.