- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
స్థలం ఒకచోట.. నిర్మాణం మరోచోట.. పట్టించుకోని రెవెన్యూ అధికారులు

దిశ, ఖమ్మం టౌన్: ఖమ్మం నగరపాలక సంస్థ లోని టౌన్ ప్లానింగ్ అధికారులు ఒక స్థలంలో పర్మిషన్ ఇచ్చి.. మరో స్థలంలో నిర్మాణం చేపడుతున్నా.. అధికార పార్టీ కార్పొరేటర్ ఒత్తిడితో అధికారులు మిన్నకుండీ పోయారు. ఈ విషయమై బాధితులు ఖమ్మం కార్పొరేషన్లో జరిగిన గ్రీవెన్స్లో గతంలో ఫిర్యాదు ఇచ్చారు. స్పందించిన కమిషనర్ ఆదర్శ సురభి సర్వే చేసి, తమకు నివేదిక ఇవ్వాలని అర్బన్ తహశీల్దార్ను కోరారు. అయినా అధికార పార్టీ కార్పొరేటర్ భర్త ఒత్తిడితో అర్బన్ రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నగరంలోని మమతా రోడ్డులో విద్యుత్ సబ్స్టేషన్ భాగంలో కమలమ్మ అనే మహిళకు సంబంధించిన 2,000 గజాల స్థలం ఉంది. ఈ స్థలం సర్వేనెంబర్ 80 లో ఉంది. అయితే సర్వే నెంబర్ 83, 84 లో స్థలం కలిగిన కొంతమంది సర్వే నెంబర్ 80 లో అపార్ట్మెంట్ నిర్మాణం చేపట్టారు. సదరు మహిళా ఈ విషయమై హైకోర్టును ఆశ్రయించింది. అనంతరం రాష్ట్ర మునిసిపల్ శాఖ డైరెక్టర్ కమిషనర్కు ఫిర్యాదు చేసింది. తర్వాత బాధితురాలు తమ లాయర్ల ద్వారా కార్పొరేషన్ కమిషనర్కి ఫిర్యాదు చేసింది.
ఈ విషయం పత్రికలో రావడంతో స్పందించిన కమిషనర్.. టౌన్ ప్లానింగ్ అధికారులను మందలించి. సర్వే చేసి అసలు నిర్మాణం ఏ స్థలం లో చేస్తున్నారో తమకు నివేదిక ఇవ్వాలని అర్బన్ తహాశీల్దార్ను కోరారు. స్వయంగా ఒక ఐఏఎస్ అధికారి కోరిన రెవెన్యూ అధికారులు పట్టించుకోకుండా సర్వే చేయకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శలున్నాయి. అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్ భర్త నిర్మాణం చేపట్టడం తో వారు మాట్లాడకుండా ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. సత్వరమే అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితురాలు కోరుతున్నారు.