- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
దిశ ఎఫెక్ట్.. అనుమతి దరఖాస్తును తిరస్కరించిన రెవెన్యూ అధికారులు

దిశ, వైరా: వైరాలో ఎలాంటి అనుమతి లేకుండా ముందుగా ఇష్టానుసారంగా నిర్మించిన భవనానికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేమని రెవెన్యూ అధికారులు తేల్చి చెప్పారు. నిర్మించిన భవనం కోసం మరల అనుమతులకు దరఖాస్తు చేసుకోవద్దని రెవెన్యూ అధికారులు సూచించారు. వైరాలోని ఎస్బీఐ టౌన్ బ్రాంచ్ పైన ఎలాంటి అనుమతులు లేకుండా భవనాన్ని నిర్మించారు. ఈ విషయమై దిశ దిన పత్రికలో అనేక వార్త కథనాలు ప్రచురతమయ్యాయి. దీంతో కంగుతిన్న ఆ భవన యజమాని దొడ్డిదారిలో అనుమతులు పొందేందుకు ప్రయత్నించాడు. అక్రమంగా భవనం నిర్మించినప్పటికీ ఆ స్థలంలో కొత్త భవనం నిర్మిస్తున్నామని తమకు అనుమతి ఇవ్వాలని ఈనెల 12వ తేదీన టీఎస్ బీ పాస్ లో దరఖాస్తు చేసుకున్నాడు. ఈ విషయమై దిశ దినపత్రికలో వైరా మున్సిపాలిటీలో అంతా రివర్స్ గేర్..ముందు నిర్మాణం ఆ తర్వాత అనుమతి అనే వార్త కథనం మంగళవారం ప్రచురితమైంది. దీంతో స్పందించిన రెవెన్యూ అధికారులు స్పందించి అనుమతి ఇవ్వటం కుదరదని స్పష్టం చేశారు. ఇప్పటికే భవనం నిర్మించి అక్కడ ఎలాంటి నిర్మాణం లేవని నూతన భవనం నిర్మిస్తున్నామని సదరు యజమాని దరఖాస్తు చేసుకోవటం విస్మయాన్ని కలిగిస్తుంది. దరఖాస్తు ప్రకారం క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించిన అధికారులు అక్కడ నిర్మించిన భవనాన్ని పరిశీలించి అనుమతి ఇవ్వకుండా టీఎస్ బీ పాస్ లో రిజెక్ట్ చేశారు. రెవెన్యూ అధికారులు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనిచేశారు. కానీ మున్సిపాలిటీ అధికారులు అక్రమ భవనం నిర్మాణంపై చర్యలు తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు.