ఉచిత విద్యుత్ పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సిగ్గుచేటు

by Sridhar Babu |
ఉచిత విద్యుత్ పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సిగ్గుచేటు
X

దిశ ప్రతినిధి,కొత్తగూడెం : ఉచిత విద్యుత్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు అన్నారు. సుజాతనగర్ రైతు వేదికలో ఉచిత విద్యుత్ పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా మండలంలోని రైతులతో రైతు సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ రాష్ట్రాన్ని రాబందుల పాలన కాకుండా రైతులే కాపాడుకోవాలని,

రైతును రాజు చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని అన్నారు. భారత దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి దిక్సూచిగా నిలిచిందని అన్నారు. రైతుబంధు మొదలు పోడు పట్టాల పంపిణీ వరకు అనేక అద్భుత పథకాలు ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజల అభ్యున్నతికి పాటుపడే ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమని అన్నారు. అభివృద్ధిని ఓర్వలేని రేవంత్ రెడ్డి వంటి వారు అనుచిత వ్యాఖ్యలు చేసినంత మాత్రాన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోలేరని హెచ్చరించారు.



Next Story

Most Viewed