ఏక ఛత్రాధిపత్యానికి చెక్

by Sumithra |
ఏక ఛత్రాధిపత్యానికి చెక్
X

దిశ, ఖమ్మం సిటీ ; ఖమ్మం అర్బన్ తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం ఒక్కసారిగా ఏకచత్రాధిపత్యానికి చెక్ పడినట్లు అయింది. ఎన్నికల బదిలీల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా తహశీల్దార్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ గత నెల 31న ఉత్తర్వులు జారీ చేశారు. కానీ నిన్నటి వరకు విధులు నిర్వహించిన తహశీల్దార్ మేదరమట్ల శైలజ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ దరఖాస్తుదారులను ఇబ్బందులకు గురిచేస్తూ బదిలీ ఉత్తర్వులు వచ్చిన కదలకుండా విధులు నిర్వహించడం పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. కొంతమంది రాజకీయ పెద్దల అండదండలు ఆమెకు మెండుగా ఉండటంతో ఎన్నికల నియమావళిని కూడా బేకాతర్ చేస్తూ విధులు నిర్వహించడం కార్యాలయ సిబ్బందిని కూడా ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి. కుప్పలు తిప్పలుగా ఫైళ్ళ మూటలు కార్యాలయంలో దర్శనం ఇవ్వడం ఆమె విధులు ఏ విధంగా నిర్వహిస్తుందో అన్నదానికి నిదర్శనంగా మిగిలిపోయాయని చెప్పాలి.

అంతేకాక ఆమె ఇష్టానికి సిబ్బంది పై పెత్తనం చేసేదని అత్యవసర పరిస్థితుల ధ్రువపత్రాలు సైతం ఎంతోకొంత ముట్ట చెప్పకుండా మంజూరు చేసేది కాదని ఆరోపణలు ఎదుర్కున్నారు. ప్రస్తుతం ఆమెను ఎక్కడకు బదిలీ చేయకుండా మూడు నెలలపాటు ఆమెకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా హోల్డ్ లో ఉంచినట్లు సమాచారం. ఇంతకాలం ఫైలు కదలక ఇబ్బందులు ఎదుర్కొన్న దరఖాస్తుదారులకు ఇప్పుడు ఆ పరిస్థితి నుండి ఇప్పుడు ఒక్కసారిగా బయట పడినట్లు అయింది. మధిరలో విధులు నిర్వహిస్తున్న సీహెచ్ స్వామిని అర్బన్ తహశీల్దారుగా సోమవారం పబ్లిక్ సర్వీస్ కమిషన్ బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పటివరకు కార్యాలయంలో పెండింగ్ లో ఉన్న ఫైళ్ళకు ఒక్కసారిగా మోక్షం కలిగినట్లుగా ప్రజలు భావిస్తున్నారు.



Next Story

Most Viewed