- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఎక్కడ చూసినా నీళ్లే... అయినా మాకు నీళ్లు దొరుకుతలేవని రోడ్డెక్కిన జనం

దిశ, ములకలపల్లి: మూడు రోజులుగా జోరు వర్షం, ఎక్కడ చూసినా నీళ్లతో పరిసరాలు నిండిపోయాయి. అయినా ఇక్కడ నీళ్ల కరువుతో ప్రజలు రోడ్డెక్కారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల కేంద్రంలో గత మూడు రోజులుగా నీళ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ పంచాయతీ వారితోపాటు అధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఆగ్రహించిన ప్రజలు ఆదివారం రోడ్డెక్కారు. మండల కేంద్రంలో విజయపురి కాలనీతో సహా అనేక ప్రాంతాల్లో గడిచిన మూడు రోజుల నుంచి నీళ్లులేవని, ఒక్క బిందె నీళ్లకోసం చాలా దూరం వెళ్లాల్సి వస్తుందని మహిళలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కనీసం మిషన్ భగీరథ కూడా ఒక్క బిందె కూడా నిండకుండానే ఆగిపోవడంతో మంచినీళ్ల కోసం డబ్బులు వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read : సైమా అవార్డ్స్లో తగ్గేదెలా అంటోన్న స్టైలీస్టార్ స్పెషల్ పోస్ట్..
ప్రత్యామ్నాయం లేకుండా చేశారు
మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయని, స్థానిక పంచాయతీ అధికారులు పనిచేసే చేతి పంపులు అన్నిటినీ పీకి వేశారు. దీంతో ప్రత్యామ్నాయం లేకుండా పోయిందని స్థానికులు వాపోతున్నారు. మూడురోజులుగా ఇబ్బంది పడుతుంటే గ్రామ పంచాయతీ ట్యాంకర్ ల తో నైనా సరఫరా చేయకుండా చోద్యం చూడటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వర్షంలో రాస్తా రోకో
విజయపురి కాలనీ వాసులంతా ఉదయం రోడ్డెక్కి రాస్తారోకో చేశారు. దమ్మపేట-పాల్వంచ ప్రధాన రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి స్థానిక సర్పంచ్ భద్రం, పంచాయతీ కార్యదర్శి అశోక్ చేరుకుని ప్రజలకు నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేయగా మూడురోజులుగా ఇబ్బంది పడుతుంటే పట్టించుకోలేదని వారిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోటారు రిపేర్ మూలంగా ఈ సమస్య తలెత్తిందని, దాని స్థానంలో మరో మోటారు తక్షణమే ఏర్పాటు చేస్తామని సర్పంచ్ భద్రం హామీ ఇవ్వడంతో రాస్తారోకోను విరమించారు.