కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని వినతి

by Sridhar Babu |
కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని వినతి
X

దిశ,తిరుమలాయపాలెం : మండలంలో అర్హులైన అనేకమంది రేషన్ కార్డులు లేక ఇబ్బందులు పడుతున్నారని, అర్హులైన వారికి వెంటనే రేషన్ కార్డులు అందించాలని శుక్రవారం సీపీఎం నాయకులు తహసీల్దార్ రాంప్రసాద్ ను కలిసి వినతి పత్రం అందించారు. దళిత బంధు ,బీసీ, మైనార్టీల లోన్లు ఇవ్వాలని అంశాలతో కూడిన వినతి పత్రాన్ని వారు ఎమ్మార్వో రాంప్రసాద్ కు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు శ్రీనివాస్, మండల కార్యదర్శి కొమ్ము శ్రీను, నర్సయ్య, వీరన్న, వెంకటేశ్ పాల్గొన్నారు.



Next Story