- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రిపోర్టర్ కొప్పుల సంపత్ మరణం ఎంతో బాధాకరం: సీఐ రాజగోపాల్
by Mahesh |

X
దిశ మణుగూరు, పినపాక: ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పని చేసే పాత్రికేయ వృత్తి ఎంతో గొప్పదని పినపాక మండల సర్కిల్ ఇన్స్పెక్టర్ బుర రాజగోపాల్ కొనియాడారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. జనని రిపోర్టర్ కొప్పుల సంపత్ చురుకైన యువకుడని ఆయన మరణం జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న వయస్సులో మరణించడం ఎంతో బాధాకరమన్నారు. కొప్పుల సంపత్ దశదిన కర్మకు పినపాక పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి 50 కేజీల బియ్యాన్ని వితరణగా అందజేస్తున్నని తెలిపారు. అలాగే ఆ కుటుంబానికి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. కొప్పుల సంపత్ దశదినకర్మ కి 50 కేజీల బియ్యాన్ని వితరణ అందజేసిన సీఐ రాజగోపాల్ ను పినపాక మండల ప్రజలు, పలువురు మేధావులు అభినందించారు.
Next Story