పువ్వాడ అజయ్ కుమార్ కు చెక్ పెడతాం.. రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |   ( Updated:2022-05-22 09:03:11.0  )
పువ్వాడ అజయ్ కుమార్ కు చెక్ పెడతాం.. రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు
X

దిశ కూసుమంచి: తెలంగాణలో రాహుల్‌ గాంధీ పర్యటన తర్వాత కాంగ్రెస్‌ శ్రేణుల్లో కొత్త జోష్‌ కనిపిస్తోంది. వరంగల్ లో రాహుల్‌ గాంధీ ప్రకటించిన డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నెల రోజుల కార్యక్రమాలకు కాంగ్రెస్‌ శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని పాలేరు గ్రామంలో టిపీసీసీ మహిళ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రామ సహాయం మాధవరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న మాజీ కేంద్ర మంత్రి రేణుక చౌదరి మాట్లాడుతూ.. మంత్రి పువ్వాడ కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని, కాంగ్రెస్ కార్యకర్తలను వేధిస్తే సహించేది లేదని. తన ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకుంటానన్నారు. పోలీసు అధికారులు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు కొమ్ముకాస్తున్నారని దుయ్యపట్టారు. వరంగల్ డిక్లరేషన్ కార్యక్రమాలను ఇంటింటింటికి తీసుకెళ్లడమే తమ లక్ష్యం అన్నారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, కాంగ్రెస్ హయాంలో రైతులు, ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగస్తులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితికి వెళ్లిందని, ప్రజా సొమ్మును ప్రజలకే ఖర్చు పెట్టాలన్నారు. తెలంగాణను అప్పుల కుప్పగా మార్చి సామాన్య ప్రజలపై పెనుభారం మోపుతోందని విమర్శించారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాలు విక్రయాలు జోరుగా సాగుతున్నాయని, తద్వారా రైతులు నష్టపోతున్నారని తెలిపారు.

నకిలీ విత్తనాలు అమ్ముతున్న యజామన్యలపై కేసులు పెట్టాలన్నారు. రైతును రాజును చేస్తానన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఖమ్మంలో రైతుల చేతులకు బేడీలు వేశారని విమర్శించారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని, రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగ సమస్యలు పెరిగాయని అన్నారు. అనంతరం రచ్చ బండ డిక్లరేషన్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ మహిళ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు రామాసహాయం మాధవరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మట్టే గురవయ్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాధాకిషోర్, మైనార్టీ జిల్లా నాయకులు కలిమ్, మధుసూదన్ రెడ్డి భత్తుల అంజయ్య, బానోత్ నాగేశ్వరావు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



Next Story

Most Viewed