మహానేత వైఎస్ఆర్ విగ్రహం తొలగింపు

by Sridhar Babu |
మహానేత వైఎస్ఆర్ విగ్రహం తొలగింపు
X

దిశ,తిరుమలాయపాలెం : మండలంలోని ఎర్రగడ్డ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహానేత, మాజీ ముఖ్యమంత్రి డా.వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని శనివారం అధికారులు తొలగించారు. వైఎస్ తనయ, వైఎస్ఆర్టీపీ వ్యవస్థాపకురాలు షర్మిల తలపెట్టిన మహా ప్రజాప్రస్థాన యాత్రలో భాగంగా గత నెల 22న షర్మిల రెండో సారి మండలానికి చేరుకొని ఎర్రగడ్డ గ్రామంలో ఆ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన వైఎస్ఆర్​ విగ్రహాన్ని ఆవిష్కరించాల్సి ఉంది. కానీ ఇదంతా జరగకముందే యాత్ర వరంగల్ జిల్లాలో షర్మిలను పోలీసులు రెండోసారి అరెస్టు చేసిన సంగతి విధితమే. కాగా ఎలాంటి అనుమతులు లేకుండా ఎర్రగడ్డ గ్రామంలో రోడ్డు పక్కన వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారంటూ ఎస్సై వరాల శ్రీనివాస్, తహసీల్దార్ పుల్లయ్య, ఎంపీడీఓ జయరాం, ఎంపీవో రాజేశ్వరి, ఎర్రగడ్డ పంచాయతీ కార్యదర్శి సుస్మిత సమక్షంలో రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది ద్వారా రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని తొలగించారు. ఏఎస్సై రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు.



Next Story